ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : డీపీవో

ABN, First Publish Date - 2020-07-09T10:31:42+05:30

గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని డీపీవో జయసుధ అన్నారు. ఇందల్వాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందల్వాయి, జూలై 8: గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని డీపీవో జయసుధ అన్నారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి, మేగ్యనాయక్‌తండాలో పల్లెప్రగతిలో భాగంగా డంపింగ్‌ యార్డు, కంపోస్ట్‌ షెడ్‌, శ్మశానవాటిక, విలేజీ పార్కు పనులను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 15వ తేదీలోపు పనులన్నీ పూర్తిచేయాలన్నారు. చంద్రాయన్‌పల్లిలో డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక పనులు, విలేజీ పార్కు విశాలమైన స్థలం ఉన్నందున మంచి చెట్లను పెంచి పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. పల్లెప్రగతిలో భాగం గా చేపట్టిన పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మళ్లీ 10 రోజుల తర్వాత ఇక్కడికి వస్తానని ఆ లోపు విలేజీ పార్కు ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో సుభాష్‌చంద్రబోస్‌, సర్పంచ్‌ లలిత గంగాదాస్‌, ఉపసర్పంచ్‌ ప్రకాష్‌, కార్యదర్శి మహేష్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-07-09T10:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising