భూములు కోల్పోయిన రైతుల ఖాతాల్లో డబ్బుల జమ
ABN, First Publish Date - 2020-06-02T10:45:16+05:30
మండలంలో నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన రైతులకు నిధుల మంజూరు నోటీసులను ఆర్డీవో కార్యాలయ సిబ్బంది
మద్నూర్, జూన్ 1: మండలంలో నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన రైతులకు నిధుల మంజూరు నోటీసులను ఆర్డీవో కార్యాలయ సిబ్బంది అందజేశారు. సోమవా రం మద్నూర్ తహసీల్ కార్యాలయంలో నాలుగు గ్రామాల శివారు రైతులు 61 మందికి మంజూ రైన నిధుల వివరాల నోటీసులను అందజేశారు. మద్నూర్ 15 మందికి రూ.2,030,722 లక్షలు, మేనూర్లో 29 మందికి రూ.3,77,2691 లక్షలు, వాడి ఫత్తేపూర్లో ఆరుగురికి రూ.2,48,1472 లక్ష లు, రుసేగావ్లో 11 మందికి రూ.9,17,7421 లక్షలు వారి ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు.
Updated Date - 2020-06-02T10:45:16+05:30 IST