ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డివైడర్‌ను ఢీకొన్న కంటైనర్‌

ABN, First Publish Date - 2020-12-01T06:15:21+05:30

మండలంలోని సికింద్రాపూర్‌ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం కంటైనర్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో డ్రైవర్‌ గుల్లాభాయ్‌ పఠాన్‌ (45) మృతిచెందినట్టు ఎస్‌ఐ సాయిరెడ్డి తెలిపారు.

జాతీయ రహదారిపై బోల్తా పడిన కంటైనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బోల్తాపడిన వాహనం
 డ్రైవర్‌ మృతి  

జక్రాన్‌పల్లి, నవంబరు 30: మండలంలోని సికింద్రాపూర్‌ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం కంటైనర్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో డ్రైవర్‌ గుల్లాభాయ్‌ పఠాన్‌ (45) మృతిచెందినట్టు ఎస్‌ఐ సాయిరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు నాగాలాండ్‌కు చెందిన కంటైనర్‌ చెన్నై నుంచి నాగ్‌పూర్‌కు టైర్ల లోడ్‌తో వెళ్తుండగా, సికింద్రాపూర్‌ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని, జాతీయ రహదారిపై అడ్డంగా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌  గుల్లాభాయ్‌ పఠాన్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన సోమవారం సాయంత్రం మృతిచెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. బోల్తాపడిన కంటైనర్‌ను పోలీసులు తొలగింపజేశారు.

Updated Date - 2020-12-01T06:15:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising