ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో చైన్‌స్నాచింగ్‌

ABN, First Publish Date - 2020-12-01T06:10:00+05:30

నగరంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఓ మహిళ మెడలోనుంచి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్టు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు
గుడికి వెళ్తుండగా జరిగిన ఘటన

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 30: నగరంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఓ మహిళ మెడలోనుంచి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్టు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నగరంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సాయినగర్‌కు చెందిన అనిత తోటి మహిళలతో కలిసి సోమవారం గుడికి వెళ్తుండగా, అభయాంజనేయస్వామి ఆలయం వద్ద వారి ఎదురుగా ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని రెండున్నర తులాల నల్లపూసలు, సుమారు రెండు తులాల బంగారు చైను తెంపుకొని పరారయ్యారని బాధితురాలు అనిత ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ లక్ష్మయ్య వివరించారు.

Updated Date - 2020-12-01T06:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising