కామారెడ్డి జిల్లాలో 21 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
ABN, First Publish Date - 2020-07-15T16:18:17+05:30
జిల్లాలో మంగళవారం 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సమాచారం. మంగళవారం సాయంత్ర ం 5 గంటల వరకు ఒక్కటే కేసు నమోదయినట్లు
కామారెడ్డి టౌన్ : జిల్లాలో మంగళవారం 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సమాచారం. మంగళవారం సాయంత్ర ం 5 గంటల వరకు ఒక్కటే కేసు నమోదయినట్లు డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలుపగా రాత్రి వరకు గతంలో సేకరించిన 214 రక్త నమూనాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయినట్లు సమాచారం. ఇందులో కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి 2, కామారెడ్డి పట్టణంలో 3, భిక్కనూర్ 1, బాన్సువాడ 5, బీర్కూర్ 2, జుక్కల్ 1, పిట్లం 4, నాగిరెడ్డిపేట 2, నస్రూల్లాబాద్ 1 పాజిటివ్ కేసులు నమోదు అయిన ట్లు తెలిసింది. అయితే ఇంకా 53 వరకు ఫలితాలు రావాల్సి ఉందని సమాచారం.
Updated Date - 2020-07-15T16:18:17+05:30 IST