ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి రైతు బలి

ABN, First Publish Date - 2020-06-16T09:46:22+05:30

విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం మరో రైతు నిండు ప్రాణాన్ని బలిగొని, కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభం విరిగినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నెలక్రితం విరిగిన విద్యుత్తు స్తంభం 
  • ఫిర్యాదు చేసినా తొలగించని తీగలు
  • ఆ వైర్లకు తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతి

రెంజల్‌, జూన్‌ 15: విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం మరో రైతు నిండు ప్రాణాన్ని బలిగొని,  కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభం విరిగినా.. దాన్నుంచి విద్యుత్తు తీగలను తొలగించకపోవడంతో అవి తాకి రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సోమవారం నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండల కేంద్ర శివారులో జరిగింది. మృతుడు 55 ఏళ్ల ప్రకాశ్‌. నెల క్రితం విద్యుత్తు స్తంభం విరిగినా అధికారులు పట్టించుకోలేదు. సోమవారం పంట పొలాల్లోకి వెళ్లిన ప్రకాశ్‌ ప్రమాదవశాత్తు ఆ తీగలకు తగలడంతో  అక్కడికక్కడనే మృతి చెందాడు.


గతంలో ఈ విషయమై విద్యుత్తు శాఖ అధికారులను ప్రకాశ్‌ కలిసి ఫిర్యాదు చేశాడని, వారు పట్టించుకోలేదని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే తన భర్త మృతిచెందాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Updated Date - 2020-06-16T09:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising