ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండ : ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచిన యువకుడు

ABN, First Publish Date - 2020-07-19T02:37:44+05:30

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంతో జనాల ప్రాణాలు పోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంతో జనాల ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దావాఖానాలో కోవిడ్-19 వార్డులో ఆక్సిజన్ అందక ఓ యువకుడు తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల్లోకెళితే.. మాడుగులపల్లి మండలం సల్కునూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇవాళ ఉదయం ఆస్పత్రిలో చేరాడు. అయితే సరైన వైద్యం అందకపోవడం.. కనీసం ఆక్సిజన్ కూడా వైద్యులు పెట్టకపోవడంతో సాయంత్రం 6గంటలకు ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు.


ఇవాళే అతని నమునాలను తీసుకొని కోవిడ్-19 టెస్ట్‌కు పంపడం జరిగింది. అతను ఆస్పత్రిలో చేరినప్పట్నుంచి ఇవాళ ఉదయం వరకూ ఒక్క డాక్టర్‌ కూడా ఆస్పత్రిలో లేకపోవడం గమనార్హం. కనీసం ఒక్కరంటే ఒక్క డాక్టర్ కూడా చేయిపట్టుకుని చూసిన పాపాన పోలేదు. గత్యంతరం లేక బెడ్ మీదనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం.. ఆయన తల్లి బాటిల్‌తో నీళ్లు పోస్తూ కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాన్ని చూసిన జనాలు కంటతడిపెడుతున్నారు.

Updated Date - 2020-07-19T02:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising