ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాలూనాయక్‌ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటాం

ABN, First Publish Date - 2020-07-06T11:04:11+05:30

రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు లాలూనాయక్‌ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని శాసనమండలి చైర్మన్‌ గుత్తా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నమండలి చైర్మన్‌ గుత్తా, మంత్రి జగదీ్‌షరెడ్డి


చందంపేట, జూలై 5 : రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు లాలూనాయక్‌ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి బిల్డింగ్‌తండా వద్ద ఈ నెల 4వ తేదీన జరిగిన కాంగ్రెస్‌ - టీఆర్‌ఎస్‌ వర్గీయుల మధ్య ఘర్షణలో రైతు సమన్వయసమితి చందంపేట మండల అధ్యక్షుడు రమావత్‌ లాలునాయక్‌ మృతి చెందాడు. ఆయన కుటుంబసభ్యులను సుఖేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘర్షణలో లాలునాయక్‌ మృతిచెందడం దురదృష్టకరమని, అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ పర్యటనలో నల్లగొండ జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T11:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising