టీఆర్ఎ్సను బలోపేతం చేయాలి : ఎమ్మెల్యే బొల్లం
ABN, First Publish Date - 2020-12-15T05:44:52+05:30
నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్
చిలుకూరు, డిసెంబరు 14 : నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండ సైదయ్య, కార్యదర్శి వంగాల రామిరెడ్డి, ఎంపీపీ ప్రశాంతి కోటయ్య, కొండా సురేష్, నాగయ్య, శివాజీ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-15T05:44:52+05:30 IST