ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగం ప్రాముఖ్యతను తెలుసుకోవాలి

ABN, First Publish Date - 2020-11-27T05:46:41+05:30

భారతదేశ రాజ్యాంగం చరిత్ర, ప్రాముఖ్యత, ఉపోద్గతం, రాజ్యాంగ గొప్పదనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు.

కలెక్టరేట్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ రూరల్‌, నవంబరు 26 :  భారతదేశ రాజ్యాంగం చరిత్ర, ప్రాముఖ్యత, ఉపోద్గతం, రాజ్యాంగ గొప్పదనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కలెక్టర్‌  ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ సభ 1949 లో నవంబర్‌ 26 వ తేదీన ఆమోదించిందని అన్నారు.  అప్పటి నుండి నవంబర్‌ 26 జాతీయ న్యాయ దినోత్సవం,రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ వి. చంద్ర శేఖర్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తో రాజ్యాంగ ఉపోద్గతం చదివించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సి.ఈ. ఓ.వీరబ్రహ్మచారి, డి.పి.ఓ.విష్ణువర్ధన్‌,డి. ఈ. ఓ.భిక్షపతి, కలెక్టరేట్‌ ఏవో మోతీలాల్‌ వివిధ విభాగాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T05:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising