వైభవంగా సూర్యనారాయణస్వామి కల్యాణోత్సవం
ABN, First Publish Date - 2020-03-16T12:11:44+05:30
మండలంలో ని తిమ్మాపురం అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం సూర్యనారాయణస్వామి
అర్వపల్లి, మార్చి 15: మండలంలో ని తిమ్మాపురం అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం సూర్యనారాయణస్వామి మూర్తి, పద్మినీ ఉషా, ఛాయదేవిల కల్యాణోత్సవం వైభవంగా జరిగిం ది. అర్చకులు మార్తి శ్రీనివాసశర్మ ఆ ధ్వర్యంలో వేదమంత్రోర్చనలు, మంగళవాయిద్యాల మధ్య కల్యాణం వైభవంగా జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మంగళ హారతులు, కొబ్బరికాయలు, నూతన వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర పోలీస్శాఖ సంఘం అధ్యక్షులు గోపిరెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్, నాగేశ్వర్రావు, రాంబాబు, రవి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-16T12:11:44+05:30 IST