సాగునీటిని సాధించే వరకు పోరాటం
ABN, First Publish Date - 2020-05-30T09:24:38+05:30
ఆలేరు నియోజకవర్గానికి సాగునీటిని అందించే గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేసే వరకు పోరాటం చేస్తామని
యాదాద్రి-ఆంధ్రజ్యోతి/తుర్కపల్లి/ రాజాపేట/ యాదాద్రిరూరల్/ ఆలేరు: ఆలేరు నియోజకవర్గానికి సాగునీటిని అందించే గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేసే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య చెప్పారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నియోజకవర్గంలో గంధమల్ల జలసాధన సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఒక్కరోజు దీక్షలు చేపట్టారు. నియోజకవర్గంలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజాపేట మండలాల్లో రైతులు, కాంగ్రెస్ నాయకులు దీక్షల్లో పాల్గొన్నారు.
రాజాపేట మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య నాయకులు వంచ వీరారెడ్డి, నెమిల మహేందర్గౌడ్ పాల్గొన్నారు. తుర్కపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్గౌడ్, గుడ్ల వరలక్ష్మి పాల్గొన్నారు. ఆలేరులో నిర్వహించిన కార్యక్రమంలో కె.వెంకటేశ్వర రాజు, ఎంఏ ఏజాజ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-30T09:24:38+05:30 IST