ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాంతాచారి పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలి

ABN, First Publish Date - 2020-12-04T05:05:02+05:30

తెలంగాణ రాష్ట్ర సాధనలో అశువులు బాసిన శ్రీకాంతాచారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

కోదాడలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ, డిసెంబరు 3: తెలంగాణ రాష్ట్ర సాధనలో అశువులు బాసిన శ్రీకాంతాచారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని  ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాంతాచారి త్యాగాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదన్నారు. కార్యక్రమంలో చందు నాగేశ్వరరావు, పయిడిమర్రి సత్యబాబు, రోజారమణి, మేదర లలిత, వెంకటేశ్వర్లు, మధు, శ్రీనివాసరావు, కైలాస్వామి, బ్రహ్మణం, అనంతాచారి,  రమే్‌షబాబు, ఉపేందర్‌, రమాదేవి, సుధారాణి పాల్గొన్నారు. 


సూర్యాపేటటౌన్‌:జిల్లా కేంద్రంలోని న్యూలైఫ్‌ స్వచ్ఛంద సేవాసమితి అధ్యక్షుడు పోతుగంటి వీరాచారి కార్యాలయంలో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్య క్రమంలో వెంకటాచారి, పాండురంగాచారి, సోమాచారి పాల్గొన్నారు.


హుజూర్‌నగర్‌: రాష్ట్రంలోని ఒక జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ కోరారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాణోతు ప్రసాద్‌, గురవయ్య, వెంకటరాజు పాల్గొన్నారు. 


చిలుకూరు : బాపూజీ గ్రంథాలయంలో  శ్రీకాంతాచారి వర్ధంతిని టీఆర్‌ఎస్‌ నాయకులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమణ నాగయ్య, కస్తూరి సైదులు, కొండా అన్నపూర్ణ, మేకపోతుల శ్రీను, మాదవరపు శ్రీను, బెల్లకొండ రాదకిష్ణ, పాషా పాల్గొన్నారు. 


నేరేడుచర్ల: మండల కేంద్రంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి  టీజేఎస్‌  కన్వీనర్‌ వురిమళ్ల రాధాకృష్ణ నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ధూళిపాళ ధనుంజయనాయుడు, కొదమగుండ్ల నగేష్‌, కొమర్రాజు వెంకట్‌, రావుల సత్యం, అబ్రహం పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T05:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising