రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ABN, First Publish Date - 2020-12-16T05:16:37+05:30
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మునిసిపల్ చైర్పర్సన్ పోతరాజు రజనీరాజశేఖర్ అన్నారు.
తిరుమలగిరి, డిసెంబరు 15 : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మునిసిపల్ చైర్పర్సన్ పోతరాజు రజనీరాజశేఖర్ అన్నారు. మునిసిపాలిటీ కేంద్రంలో జనగాం- సూర్యాపేట రహదారి వెంట యూటర్న్లను మునిసిపల్ సిబ్బందితో మంగళవారం మూసివేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల మునిసిపాలిటీ కేంద్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుల సహకారంతో అవసరం లేని చోట ఉన్న యూటర్న్లను మూసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్చైర్మెన్ సంకెపల్లి రఘునందన్రెడ్డి, కమిషనర్ దండు శ్రీనివాస్, ఎస్ఐ డానియోల్ కుమార్, పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T05:16:37+05:30 IST