గంటపాటు కుండపోత : పేటను ముంచెత్తిన వాన
ABN, First Publish Date - 2020-09-26T10:30:20+05:30
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం గంటసేపు భారీవర్షం కురిసింది. దీంతో పలు వీధులు జలమయం
సూర్యాపేటటౌన్ / నడిగూడెం, సెప్టెంబరు 25 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం గంటసేపు భారీవర్షం కురిసింది. దీంతో పలు వీధులు జలమయం అయ్యాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని 60 అడుగుల రోడ్డు, కొత్తబస్టాండ్ ప్రాంతం, మానసనగర్, పీఎ్సఆర్సెంటర్లతో పాటు పలు రహదారులు సుమారు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కుండపోత వర్షంతో పూర్తిగా వర్షం నీరు చేరాయి. అదేవిధంగా నడిగూడెం మండలంలో మూడు రోజులు తీవ్ర ఉక్కపోతను తలపించిన వాతావరణం గాలివానతో చల్లబడింది. భారీ వర్షానికి ఇప్పటికే అలుగు పోస్తున్న చెరువులు, కుంటలతో రోడ్లపైకి నీళ్లు వస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
Updated Date - 2020-09-26T10:30:20+05:30 IST