సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2020-12-04T06:11:05+05:30
ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి న వారిని శిక్షించాలని టీఆర్ఎస్ నేతలు పోలీసు లకు గురువారం ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు
నార్కట్పల్లి, డిసెంబరు 3: ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి న వారిని శిక్షించాలని టీఆర్ఎస్ నేతలు పోలీసు లకు గురువారం ఫిర్యాదు చేశారు. ఇటీవల దు బ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి చెందగా, జరిగిన ఉప ఎన్నికలో బుద్ధి చెప్పామని, ఎమ్మె ల్యే నోముల నర్సింహయ్య మృతి చెందగా, నిర్వహించే ఉప ఎన్నికలో, మరో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మృతి చెందితే ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారన్నారు. ఎమ్మెల్యేలను మానసి కంగా ఇబ్బందిపెడుతున్న నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేత లు కోరారు. ఈ మేరకు నార్కట్పల్లి ఎస్ఐ బి.యాదయ్యకు ఎంపీటీసీ సభ్యుడు పుల్లెం ల ముత్తయ్య, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, వార్డుసభ్యుడు మేడబోయిన శ్రీనివాస్యాదవ్ ఫిర్యాదు చేశారు.
Updated Date - 2020-12-04T06:11:05+05:30 IST