పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN, First Publish Date - 2020-12-03T05:55:36+05:30
ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశీర్వదించి గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలపై పోరాడుతానని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు.
తుంగతుర్తి, డిసెంబరు 2: ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశీర్వదించి గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలపై పోరాడుతానని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. మండలకేంద్రంలో బుధవారం జరిగిన ప్రైవేట్ టీచర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం లో ఉద్యమం ఆకాంక్ష నెరవేరడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమస్యలు పరిష్కరించకుండా కేసీఆర్కు భజన చేస్తున్నారని విమ ర్శించారు. ప్రశ్నించేవాళ్లను సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఎప్పుడూ నిలబెట్టరన్నారు. కార్యక్రమంలో మధు, శ్రీకాంత్, సురేష్, గోపాల్, ఎల్లయ్య పాల్గొన్నారు.
Updated Date - 2020-12-03T05:55:36+05:30 IST