ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసులు తగ్గుతున్నా పర్యవేక్షణ కొనసాగుతుంది

ABN, First Publish Date - 2020-04-28T05:30:00+05:30

కరోనా వైరస్‌ పాజిటి వ్‌ కేసులు తగ్గుతున్నా, అనుమానితులపై అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి


సూర్యాపేట (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 27: కరోనా వైరస్‌ పాజిటి వ్‌ కేసులు తగ్గుతున్నా, అనుమానితులపై అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కట్టడి ప్రాంతమైన కుడకుడను ఎస్పీ భాస్కరన్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 14 రోజుల నుంచి కుడకుడ ప్రాంతంలో ఎటువంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో రెడ్‌జోన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు.


ఇప్పటి నుంచి కరోనా వైరస్‌ లక్షణాలు ఉంటేనే పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తామన్నారు. కుడకుడను కట్టడి జాబితా నుంచి తొలగించినా ఆరోగ్య సర్వే యథావిధిగా కొనసాగుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో 28 రోజుల పాటు ఇంటింటి సర్వే కొనసాగుతోందన్నారు. జిల్లాలో సెకండరీ కాంటాక్ట్‌ చైన్‌ తెగిపోవడంతో పాజిటివ్‌ కేసుల ఉధృతి తగ్గిందన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుం డా స్వీయనియంత్రణలో ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించి భౌతికదూరం పాటించాలన్నారు.


కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట డీఎస్పీ మోహన్‌కుమార్‌, రూరల్‌ సీఐ విఠల్‌రెడ్డి, తహసీల్దార్‌ పులి సైదు లు, చివ్వెంల ఎస్‌ఐ లోకే్‌షకుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-04-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising