ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడుకు చేతిలో తల్లి హతం... రోకలిబండతో కొట్టడంతో..

ABN, First Publish Date - 2020-07-08T21:09:34+05:30

మద్యానికి డబ్బులు ఇవ్వడంలేదని ఆగ్రహంతో కన్నతల్లినే రోకలిబండతో మోది కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో తరుచూ గొడవ 

నిరాకరించడంతో రోకలిబండతో మోదిన కొడుకు


పెద్ద అడిశర్లపల్లి (నల్లగొండ): మద్యానికి డబ్బులు ఇవ్వడంలేదని ఆగ్రహంతో కన్నతల్లినే రోకలిబండతో మోది కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం బాలాజీనగర్‌తండాలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేగావత్‌ బుజ్జి(48), భర్త ధర్మ 10 సంవత్సరాల క్రితం మృతిచెందాడు. కూలీ పనిచేసుకొని జీవనం కొనసాగిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడు మున్నా కూలీ పనిచేసుకొని ఇంటి వద్దనే తల్లికి ఆసరాగా ఉంటున్నాడు. అతడు ఇటీవల మద్యానికి బానిసై డబ్బులకోసం తరుచూ తల్లిని వేధించడం మొదలుపెట్టాడు. బుధవారం కూడా డబ్బులు అడగడంతో, ఆమె అందుకు నిరాకరించింది. దీంతో పక్కనే ఉన్న రోకలిబండతో మోదడంతో బుజ్జి అక్కడికక్కడే మృతిచెందింది. బుజ్జి పెద్ద కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపాలరావు తెలిపారు. 

Updated Date - 2020-07-08T21:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising