ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కల్పనలో జాప్యం: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-12-18T04:59:11+05:30

ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించడంలో జాప్యం జరుగుతోందని, సిబ్బంది పనితీరును మార్చుకోవాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకూరు, డిసెంబరు 17 : ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించడంలో జాప్యం జరుగుతోందని,  సిబ్బంది పనితీరును మార్చుకోవాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో చిలుకూరు, మఠంపల్లి మండలాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులను ఆయన గురువారం సమీక్షించారు. గ్రామాల్లో జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి 100 రోజులు ఉపాధి కల్పించాలని అన్నారు. గ్రామకార్యదర్శులు కూలీలకు పనికల్పించడం తమ విధిగా భావించాలన్నారు. గ్రామాల్లో ఉపాధి పనులను గుర్తించి గ్రూప్‌ల వారీగా కూలీలకు పనులు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. హరితహారం మొక్కలు చనిపోకుండా చూడాలన్నారు. చనిపోయిన చోట కొత్త మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిలుకూరు, మఠంపల్లి మండలాల వారీగా కార్యదర్శుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, డీపీవో యాదయ్య, ఏపీడీ పెంటయ్య, డీఎల్‌పీవో శ్రీరాములు, చిలుకూరు ఎంపీపీ ప్రశాంతి కోటయ్య, ఎంపీడీవోలు ఈదయ్య, జానకిరాములు, ఎంపీవో యర్రయ్య, కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-18T04:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising