దర్వేశిపురం ఆలయంలో కార్తీక పూజలు
ABN, First Publish Date - 2020-11-28T06:52:46+05:30
మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల రేణుకా ఎల్లమ్మ ఆలయానికి శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది.
అమ్మవారికి హారితి ఇస్తున్న అర్చకుడు
కనగల్, నవంబరు 27 : మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల రేణుకా ఎల్లమ్మ ఆలయానికి శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని కార్తీకమాస ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి నాగపడిగలకు మొక్కుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేరాలని ముడుపులు కట్టారు. కొంతమంది భక్తులు బోనాలు తెచ్చి నైవేద్యాలు సమర్పించా రు. ఆయా కార్యక్రమాల్లో ఈవో ప్రభాకరసత్యమూర్తి సిబ్బంది చంద్ర య్య, లింగయ్య, ఉపేందర్రెడ్డి, నాగరాజు అర్చకులు మల్లాచారి, శ్రవణ్కుమారాచార్యులు, సుదర్శణాచార్యులు, ఫణి, నాగరాజ పాల్గొన్నారు.
Updated Date - 2020-11-28T06:52:46+05:30 IST