తక్షణమే కరోనా పరీక్షలు పెంచాలి: టీడీపీ
ABN, First Publish Date - 2020-07-07T07:08:41+05:30
తక్షణమే కరోనా పరీక్షలు పెంచాలి: టీడీపీ
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విస్తృతమవుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం తక్షణమే కరోనా పరీక్షలు, రోగులకు సౌకర్యాలు గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు. సోమవారం ఎన్టీఆర్భవన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, కరోనా విస్తృతిపై చర్చించారు.
Updated Date - 2020-07-07T07:08:41+05:30 IST