ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2020-07-09T11:12:23+05:30

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి


శాయంపేట, జూలై 8: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని గట్లకానిపర్తి, ప్రగతిసింగారం గ్రామాల్లో రైతు వేదిక భవనాలు, మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌ షెడ్‌ నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. గట్లకానిపర్తిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఎంతో లాభం చేకూర్చిందన్నారు. రైతులకు వానాకాలం రైతుబంధు సాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.


కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా శాయంపేటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్‌, ఎంపీడీవో సుమనావాణి, ఏవో గంగాజమున, ఎంపీపీ తిరుపతిరెడ్డి, సర్పంచ్‌లు కందగట్ల రవి, బొమ్మకంటి సాంబయ్య, పోతు సుమలత, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌, ఎంపీటీసీలు బాసని చంద్రప్రకాశ్‌, రజిని, స్వాతి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T11:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising