ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన రెవెన్యూ చట్టంతో భూ తగాదాలకు చెక్‌

ABN, First Publish Date - 2020-09-27T14:50:59+05:30

సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న నూతన రెవెన్యూ చట్టంతో భూ తగాదాలకు చెక్‌ పెట్టవచ్చని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

హన్మకొండ టౌన్‌, సెప్టెంబరు 26: సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న నూతన రెవెన్యూ చట్టంతో భూ తగాదాలకు చెక్‌ పెట్టవచ్చని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లు, డివిజన్‌ పార్టీ అధ్యక్షులతో శనివారం ఎమ్మెల్యే అరూరి రమేష్‌ సమావేశమయ్యారు. నూతన రెవెన్యూ చట్టం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ నియోజకవర్గ పరిధిలో ట్రాక్టర్‌ ర్యాలీలు చేపట్టాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గ సత్తా చాటేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. మండలాల వారీగా చేపట్టనున్న ట్రాక్టర్ల ర్యాలీలు, సభల వివరాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్‌ పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T14:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising