హైదరాబాద్ ఫలక్నుమాలో తప్పిన పెను ప్రమాదం
ABN, First Publish Date - 2020-10-18T03:38:02+05:30
ఫలక్నుమాలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడింది. రైలు పట్టాలపైకి వరద నీరు వచ్చి
హైదరాబాద్: ఫలక్నుమాలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడింది. రైలు పట్టాలపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షానికి ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. సాయంత్రం మొదలైన వర్షం.. కుండపోతగా కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. మరోవైపు ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2020-10-18T03:38:02+05:30 IST