ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలసేకరణలో ఇబ్బందులు రాకుండా చర్యలు-తలసాని

ABN, First Publish Date - 2020-03-26T23:52:31+05:30

రాష్ట్రంలో పాలసేకరణ, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలసేకరణ, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని తరిమికొట్టడానికి లాక్‌డౌన్‌ అమలు జరుగుతోందన్నారు. గురువారం పాలసేకరణ, సరఫరా పై అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువులైన పాలు, పాల పదార్ధాల పంపిణీకి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నిరంతరాయంగా పాల సరఫరా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. పాల సేకరణకు గ్రామాలకు వె ళ్లే వాహనాలను పలు గ్రామాల్లోని ప్రజలు అనుమతించడం లేదని, పాల సేకరణకు సహకరించేలా స్థానిక ప్రజా ప్రతినిదులు ,పాల సంఘాల అధ్యక్షులు చొరవ తీసుకోవాలని సూచించారు. పాల సరఫరా చేసే వాహనాలకు ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులను ఆదేశించాలని సీఎస్‌కు సూచించామన్నారు. పశుసంపద ఆరోగ్యపరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. పశువులదాణా, కోడిగుడ్లు, చేపలు రవాణా వాహనాలకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-03-26T23:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising