ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్టు వాగుతున్నారు- తలసాని

ABN, First Publish Date - 2020-12-19T20:52:05+05:30

గ్రేటర్‌ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ కొత్త బిచ్చగాళ్లు పొద్దెరుగరు అన్నట్టుగా బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: గ్రేటర్‌ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ కొత్త బిచ్చగాళ్లు పొద్దెరుగరు అన్నట్టుగా బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గం పరిధిలోని ఆకుపాముల గ్రామంలో జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద ముంపునకు గురైన కుటుంబాలకు 25వేల చొప్పున ఆర్ధిసాయం అందించకుంటే ప్రజలే మీపై తిరగబడతారని అన్నారు. 


దేశం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కేవలం రెండు ఎన్నికల్లో గెలుపుకే బిజెపి నాయకులు విర్రవీగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అనేక ఎన్నికలను చూసిందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికే వినియోగించాలన్నారు. పదే పదే ముఖ్యమంత్రి ని అరెస్ట్‌చేస్తామంటున్నారు. మీకు అంత ధైర్యం ఉందా? అంటూ మంత్రి తలసాని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటుస్థానిక నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-19T20:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising