ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతం కావాలి

ABN, First Publish Date - 2020-07-12T01:12:49+05:30

గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద బలోపేతం కావాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డిజిల్లా: గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద బలోపేతం కావాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌అన్నారు. కుల వృత్తులపై ఆధారపడ్డ వారి కుటుంబాలు ఆర్ధికంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌నియోజక వర్గం పరిధిలోని ఫరూఖ్‌ నగర్‌ మండలం కంసాని పల్లి గ్రామ పరిధిలో ఉన్న పశువీర్యోత్పత్తి కేంద్రాన్ని మంత్రి తలసాని సందర్శించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పశువులకు ఉపయోగించే అత్యాధునిక లేబోరేటరీని ఏర్పాటుచేస్తామన్నారు. గాలికుంటు వ్యాధులు రాకుండా పశువులకు సరియైున సమయంలో నట్టల నివారణకు మందులను వేయాలని పేర్కొన్నారు.


పశువులకు గర్భధారణ సమయంలో సరైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా పశువీర్యోత్పత్తి కేంద్రం ఆవరణలో మొక్కలను నాటారు. నాటిన మొక్కలను పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-12T01:12:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising