ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబజార్లలో రూ. 35 లకు కిలో ఉల్లిగడ్డ అమ్మకాలు

ABN, First Publish Date - 2020-10-24T22:11:40+05:30

రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు పెరిగిపోవడంతో సాధారణ ప్రజలకు తక్కువ ధరలకే ఉల్లిగడ్డ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలుచేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు పెరిగిపోవడంతో సాధారణ ప్రజలకు తక్కువ ధరలకే ఉల్లిగడ్డ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలుచేస్తోంది. ఈమేరకు జంటనగరాల్లోని రైతుబజార్లలో కిలో ఉల్లిగడ్డ 35 రూపాయలకే అందించనున్నట్టు మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శనివారం నుంచే దీనిని అమలు చేస్తున్నామన్నారు. ఉల్లిగడ్డ ధరల నియంత్రణకోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జంటనగరాల్లోని 11 రైతుబజార్లలో ఉల్లిని అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి వ్యక్తికి రెండు కిలలో చొప్పున అందిస్తామన్నారు. దీనికి ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు.


భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా ఉల్లిపంట పెద్దమొత్తంలో దెబ్బతిన్నది. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు చేయాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. 

Updated Date - 2020-10-24T22:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising