విలువలు పెంపొందించుకోవాలి: మంత్రి నిరంజన్రెడ్డి
ABN, First Publish Date - 2020-10-24T09:34:30+05:30
విలువలు పెంపొందించుకోవాలి: మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఒక తరం నుంచి మరో తరానికి అందించాల్సిన అసలైన వారసత్వ సంపదలు భాష, జ్ఞానం, సంస్కృతి అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ సంయుక్త తెలుగు సాంసకృతిక మహోత్సవ ఆన్లైన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మాతృభాషపై పట్టు ఉంటేనే ఇతర భాషలపై పట్టు సాధించగలుగుతారన్నారు. భాషతోపాటు విలువలను పెంపొందించుకోవడం ప్రధానమన్నారు. భాషకు సంబంధించి రచనలు, మహనీయుల పుస్తకాలు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో గల్లా అరుణకుమారి, మాజీ ఎంపీ మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే జయప్రకా్షనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-24T09:34:30+05:30 IST