ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అల్లోల
ABN, First Publish Date - 2020-08-08T20:07:38+05:30
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరామర్శించారు.
సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరామర్శించారు. చిట్టాపూర్లో రామలింగారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు. జర్నలిస్ట్గా, ఎమ్మెల్యేగా రామలింగారెడ్డి తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఈసందర్భంగా పేర్కొన్నారు. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతికి సంతాపం
కాగా కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతిపట్ల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. 1991- 96 మధ్య ఎంపిలుగా తమ ఇద్దరి మధ్య ఉన్నఅనుబంధాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. దళితుల హక్కులు, వారి ఉన్నతి కోసం నంది ఎల్లయ్య ఎంతో కృషి చేశారని అన్నారు.
Updated Date - 2020-08-08T20:07:38+05:30 IST