ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటినుంచి వెళ్లిపోయిన తల్లీకూతుళ్లు క్షేమం

ABN, First Publish Date - 2020-07-02T11:54:24+05:30

కుటుంబ కలహాలతో ఇంట్లోంచి వెళ్లిపోయిన తల్లీ, ఇద్దరు కూతుళ్లను బుధవారం కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌, జూలై 1: కుటుంబ కలహాలతో ఇంట్లోంచి వెళ్లిపోయిన తల్లీ, ఇద్దరు కూతుళ్లను బుధవారం కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. తూప్రాన్‌ ఎస్‌ఐ సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్‌ మండలం యావాపూర్‌కు చెందిన రిజ్వానా వివాహం కౌడిపల్లి మండలం రాచపేటకు చెందిన జహంగీర్‌తో జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఆస్మా, సమీరా ఉన్నారు. వారి కుటుంబం తూప్రాన్‌లో కొన్ని రోజులుగా నివాసముంటోంది. జహంగీర్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే జహంగీర్‌తో గొడవ జరగడంతో రిజ్వానా తమ కూతుళ్లను తీసుకొని జూన్‌ 4న ఇంటి నుంచి వెళ్లిపోయింది. జహాంగీర్‌ ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రిజ్వానా మేడ్చల్‌లో నివాసముంటున్నట్లు తెలియయడంతో ఆమెతో పాటు ఆస్మా, సమీరాను బుధవారం తూప్రాన్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. భార్యాభర్తలకు ఎస్‌ఐ కౌన్సెలింగ్‌ నిర్వహించి, పంపించారు.

Updated Date - 2020-07-02T11:54:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising