వెంచర్ కంచెలో ఇరుక్కొని యువకుడి మృతి
ABN, First Publish Date - 2020-12-29T05:29:00+05:30
బహిర్భూమికి వెళ్లిన యువకుడు కుంట వద్ద వెంచర్ కంచెలో ఇరుక్కొని మృతిచెందిన సంఘటన తూప్రాన్లో చోటు చేసుకున్నది.
తూప్రాన్, డిసెంబరు 28 : బహిర్భూమికి వెళ్లిన యువకుడు కుంట వద్ద వెంచర్ కంచెలో ఇరుక్కొని మృతిచెందిన సంఘటన తూప్రాన్లో చోటు చేసుకున్నది. ఎస్ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం పట్టణానికి చెందిన పత్రి కిష్టయ్య కుమారుడు రమేశ్ (20) మధ్యాహ్నం సమయంలో తమ్మడికుంట వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కుంట వద్ద వెంచర్కు ఏర్పాటు చేసిన సిమెంట్ ప్రహరీగోడ సందు నుంచి కుంటలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సిమెంట్ పలకలు ప్రమాదవశాత్తు జారి రమేశ్ మెడపై పడడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-12-29T05:29:00+05:30 IST