హుస్సేన్నగర్లో సాగువిస్తీర్ణంపై శాంపిల్ సర్వే
ABN, First Publish Date - 2020-12-02T06:00:13+05:30
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హుస్సేన్నగర్ గ్రామంలో మంగళవారం పంటల సాగువిస్తీర్ణంపై శాంపిల్ సర్వేను నిర్వహించారు.
న్యాల్కల్, డిసెంబరు 1: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హుస్సేన్నగర్ గ్రామంలో మంగళవారం పంటల సాగువిస్తీర్ణంపై శాంపిల్ సర్వేను నిర్వహించారు. హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖ ఆదేశాల మేరకు ఈ సర్వే జరిగింది. ఇందుకు సంబంధించి గ్రామంలోని 74 మంది రైతులను డైరెక్టరేట్ అధికారులు ఎంపిక చేయగా, పలువురు మండల అధికారులు వారి పొలాలను సందర్శించి పంటల వివరాలను నమోదు చేశారు. కార్యక్రమంలో మండల గణాంక అధికారి శ్రీనివా్సరెడ్డి, ఏఈవోలు నికిత, మమత, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-02T06:00:13+05:30 IST