కంటి ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2020-08-02T10:33:54+05:30
కంటి ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కొండపాక, ఆగస్టు 1: అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి మంత్రి హరీశ్రావు చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మర్పడగ శివారులోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని శనివారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో బస్స్టాండ్ను ఏర్పాటు చేయాలని ఆస్పత్రి సిబ్బంది మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయమై ప్రతిపాదనలను సిద్ధం చేసి, రాజీవ్ రహదారిపై బస్స్టాప్ ఏర్పాటు చేయాలని ఫోన్లో గడా ప్రత్యేక అధికారిని ఆదేశించారు.
Updated Date - 2020-08-02T10:33:54+05:30 IST