ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

ABN, First Publish Date - 2020-10-25T06:31:12+05:30

మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు శనివారం ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను ఒకేసారి బదిలీ చేయడం గమనార్హం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకట్రామారెడ్డి సంగారెడ్డికి బదిలీ

మెదక్‌ జిల్లాకు హన్మంతరావు

సిద్దిపేటకు భారతి హోళికెరీ నియామకం


ఆంధ్రజ్యోతి, మెదక్‌, అక్టోబరు 24 : మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు శనివారం ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను ఒకేసారి బదిలీ చేయడం గమనార్హం. ప్రస్తుత సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డిని సంగారెడ్డికి, సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావును మెదక్‌కు, మంచిర్యాల కలెక్టర్‌గా ఉన్న భారతి హోళికెరీని సిద్దిపేటకు బదిలీ చేశారు. మెదక్‌ కలెక్టర్‌గా పని చేసిన ధర్మారెడ్డి జూలై 31న ఉద్యోగ విరమణ చేయగా...ఇన్‌చార్జి బాధ్యతలను వెంకట్రామారెడ్డికి అప్పగించారు. దుబ్బాక ఉప ఎన్నికలు, ఇతర కారణాల నేపథ్యంలో ప్రభుత్వం పలువురు ఐఏఎ్‌సలకు స్థానచలనం కల్పించింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వెంకట్రామారెడ్డి సిద్దిపేట జిల్లా తొలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత 2018లో సిరిసిల్ల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. 10 నెలల అనంతరం తిరిగి సిద్దిపేటకు వచ్చారు.

Updated Date - 2020-10-25T06:31:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising