ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగిన మత్తులో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-11-26T06:30:35+05:30

తాగుడుకు బానిసై ఓ వ్యక్తి విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌, నవంబరు 25: తాగుడుకు బానిసై ఓ వ్యక్తి విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజుపాలెంకు చెందిన కన్నా వెంకట్రావు కుటుంబం 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం తూప్రాన్‌కు వచ్చి నివసిస్తున్నారు. వెంకట్రావుతో పాటు అతడి కుమారుడు కన్న గంగరాజు(35)కూడా ఇంట్లో ఇడ్లీలు చేసి సైకిళ్లపై తిరుగుతూ విక్రయిస్తుంటారు. కాగా గంగరాజు తాగుడుకు బానిసై వ్యాపారం చేయలేని స్థితికి చేరుకున్నాడు. మంగళవారం తాను ఇడ్లీ వ్యాపారం చేస్తానంటూ కోరగా ఇంటి వద్దనే ఉండాలంటూ తండ్రి నచ్చజెప్పాడు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన గంగరాజు తాగిన నిషాలో విషం సేవించి అస్వస్థతకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో అతడిని తూప్రాన్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి కుమారుడు ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-11-26T06:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising