ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దుర్మార్గాలను ఎండగడతాం

ABN, First Publish Date - 2020-12-27T05:38:53+05:30

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భూఆక్రమణలు పేట్రేగిపోతున్నాయని, చేర్యాల పెద్ద చెరువు మత్తడి ఆవరణ స్థల దురాక్రమణపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీరుపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జీ.నాగయ్య అన్నారు.

చేర్యాల పెద్దచెరువు మత్తడి స్థలాన్ని పరిశీలిస్తున్న సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు నాగయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జీ.నాగయ్య

చేర్యాల, డిసెంబరు 26 : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భూఆక్రమణలు పేట్రేగిపోతున్నాయని, చేర్యాల పెద్ద చెరువు మత్తడి ఆవరణ స్థల దురాక్రమణపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీరుపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జీ.నాగయ్య అన్నారు. శనివారం చేర్యాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేర్యాలలో పూర్వం నుంచి పెద్ద చెరువు మత్తడి ఆవరణ స్థలాన్ని నీటి పారకం కోసమే పట్టాదారులు వదిలిపెట్టగా.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమణ చేయడం తగదన్నారు. సంబంఽధిత స్థలాన్ని మున్సిపాలిటీ అప్పగించాలని ప్రజలు న్యాయసమ్మతంగా ఆందోళనలు సాగిస్తున్నారని, ఈ విషయంపై అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. చెరువు మత్తడిస్థలాన్ని మున్సిపాలిటీకి అందించాలని, లేకపోతే ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. అనంతరం పెద్దచెరువు మత్తడి ఆవరణ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, నాయకులు రాళ్లబండి శశిధర్‌, పోలోజు శ్రీహరి, కొంగరి వెంకట్‌మావో, రాళ్లబండి నాగరాజు, ఆముదాల నర్సిరెడ్డి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T05:38:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising