ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరి లేదు.. బేసి లేదు!

ABN, First Publish Date - 2020-05-13T05:56:11+05:30

లాక్‌డౌన్‌ విధించిన 50 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారులకు కొన్ని నియమనిబంధనలు విధిస్తూ దుకాణాలను తెరుచుకునేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి రూరల్‌ : లాక్‌డౌన్‌ విధించిన 50 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారులకు కొన్ని నియమనిబంధనలు విధిస్తూ దుకాణాలను తెరుచుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ రాజశ్రీ షా వ్యాపారులు సరి, బేసి సంఖ్యల ఆధారంగా రోజు విడిచి రోజు దుకాణాలను తెరుచుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 8 మున్సిపాలిటీల్లో  2, 4, 6, 8, 10, 12, 14 నంబర్‌ ఉన్న షాపులు సరి తేదీల్లో, 1, 3, 5, 7, 9, 11, 13, 15 తదితర నంబర్‌ కలిగిన షాపులు బేసి తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు.


దుకాణ యాజమాన్యాలు, వినియోగదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. సరి, బేసి ఆధారంగా కాకుండా వారి ఇష్టానుసారంగా దుకాణాలు తెరుస్తున్నారు. మాస్కులు ధరించకున్నా, భౌతిక దూరం పాటించకున్నా మున్సిపల్‌ అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం వాహనదారులకు జరిమానాలు విధిస్తూ సరిపెట్టుకుంటున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. 

Updated Date - 2020-05-13T05:56:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising