బాబును అడ్డుకోవడం హేయమైన చర్య
ABN, First Publish Date - 2020-02-28T10:55:26+05:30
విశాఖపట్నం ఎయిర్పోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైసీపీ నాయకులు అడ్డుకోవడం హేయమైన చర్య అని టీడీపీ మెదక్ పార్లమెంట్ అధ్యక్షుడు ఇల్లెందుల రమేశ్ అన్నారు.
టీడీపీ మెదక్ పార్లమెంట్ అధ్యక్షుడు ఇల్లెందుల రమేశ్
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 27 : విశాఖపట్నం ఎయిర్పోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైసీపీ నాయకులు అడ్డుకోవడం హేయమైన చర్య అని టీడీపీ మెదక్ పార్లమెంట్ అధ్యక్షుడు ఇల్లెందుల రమేశ్ అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, 20 సంవత్సరాలకు పైగా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన చంద్రబాబునాయుడి కాన్వాయ్పై వైసీపీ నాయకులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్మాద ప్రభుత్వంగా మారిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా తమ తప్పును సరిదిద్దుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-02-28T10:55:26+05:30 IST