ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారదర్శకంగా ధరణి

ABN, First Publish Date - 2020-10-30T11:46:57+05:30

భూముల రిజిస్ర్టేషన్‌ కోసం రైతులకు పైరవీలు లేకుండా పూర్తి పారదర్శకంగా సేవలందించేందుకే ధరణి సేవలను ప్రారంభిస్తున్నామని కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వచ్చే నెల 2 నుంచి సిటిజన్‌ పోర్టల్‌ సేవలు ప్రారంభం

కలెక్టర్‌ ఎం. హన్మంతరావు


మనోహరాబాద్‌, అక్టోబరు 29:  భూముల రిజిస్ర్టేషన్‌ కోసం రైతులకు పైరవీలు లేకుండా పూర్తి పారదర్శకంగా సేవలందించేందుకే ధరణి సేవలను ప్రారంభిస్తున్నామని కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు. మనోహరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం ఆర్డీవో శ్యాంప్రకాష్‌, తహసీల్దార్‌  శ్రీదేవీతో కలిసి ధరణి పోర్టల్‌ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 2 నుంచి సిటిజన్‌ పోర్టల్‌ సేవలను పూర్తి స్థాయిలో అందించనున్నట్లు వెల్లడించారు. ముందుగా కొనుగోలుదారులు, ఫౌతి, పార్టేషన్‌, గిఫ్ట్‌ ద్వారా ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలన్నారు. జిల్లాలోని అన్నీ తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు, త్వరలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్‌ సేవలు పునఃప్రారంభమవుతాయన్నారు. తహసీల్దార్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌లుగా సేవలందించనున్నారని వారికి సహాయకులుగా డీటీలు ఉంటారని చెప్పారు. అందుకు అవసరమైన సిబ్బంది, పరికరాల ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందన్నారు. భూముల వివరాలను పొందు పర్చుకునేందుకు ధరణి సేవలు నిరంతరంగా కొనసాగుతాయని చెప్పారు. 

Updated Date - 2020-10-30T11:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising