అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-12-02T05:48:41+05:30
చేతికొచ్చిన పంట వర్షానికి నష్టపోవడంతో అప్పులు తీర్చే దారిలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో మంగళవారం జరిగింది.
కొల్చారం, డిసెంబరు 1: చేతికొచ్చిన పంట వర్షానికి నష్టపోవడంతో అప్పులు తీర్చే దారిలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన పోతుల రాములు (35) తనకున్న రెండెకరాల్లో సన్నరకం వరిని సాగు చేశారు. వర్షాలు, తెగుళ్లతో పంట పూర్తిగా నష్టపోయింది. పెట్టుబడి ఖర్చులతో పాటు కుటుంబ పోషణకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పు తీర్చేమార్గం లేకపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలై భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మానసిక క్షభకుగురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Updated Date - 2020-12-02T05:48:41+05:30 IST