ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2020-07-09T11:51:45+05:30

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాపన్నపేట, జూలై 8: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని కుర్తివాడ గ్రామానికి చెందిన సాతేల్లి రమేశ్‌ (35) తాను కౌలుకు తీసుకున్న పొలంలో వరినాటు వేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం మోటారు చెడిపోవడంతో మరమ్మతుల కోసం స్టార్టర్‌ డబ్బాను ముట్టుకున్నాడు. ఆ డబ్బాకు విద్యుత్‌ ప్రవాహం ఉండటంతో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త ఎంతకీ రాకపోవడంతో పొలంలో పని చేస్తున్న అతడి భార్య వచ్చి చూసే సరికి కిందపడి ఉన్నాడు. నాటు వేసేందుకు వచ్చిన వారు రమేశ్‌ను పరిశీలించగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. 

Updated Date - 2020-07-09T11:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising