ఏరువాక సాగారో
ABN, First Publish Date - 2020-06-06T10:01:30+05:30
ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నదాతలు శుక్రవారం ఏరువాక మహోత్సం ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండ్లను, ఎద్దులను అందంగా
సిటీ న్యూస్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నదాతలు శుక్రవారం ఏరువాక మహోత్సం ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండ్లను, ఎద్దులను అందంగా అలంకరించి ఆయా గ్రామాల్లోని వీధుల్లో ఊరేగించారు. పశువులకు అట్లు తినిపించడంతో పాటూ పానకం తాగించారు. యువకులు ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా గ్రామశివారుల్లోని ఆలయాల చుట్టూ ఎడ్లబండ్లను ప్రదక్షిణలు చేయించి తమ ఇంట సిరిసంపదలు కురియాలని పూజలు నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో కరోనా ప్రభావంతో పశువులను అలంకరించి ఇళ్ల ఎదుటే పూజలు చేశారు. ఊరేగింపులు నిర్వహించలేదు. మరికొన్ని గ్రామాల్లో రైతులు మాస్కులు ధరించకుండా భౌతిక దూరం మరిచి వేడుకల్లో పాల్గొన్నారు.
Updated Date - 2020-06-06T10:01:30+05:30 IST