ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-12-30T05:33:58+05:30

డబల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఆదేశించారు.

సిద్దిపేటలో ‘తపస్‌’ క్యాలెండర్‌ను అవిష్కరిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కాంట్రాక్టర్లను ఆదేశించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

దౌల్తాబాద్‌ డిసెంబరు 29, డబల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఆదేశించారు. మంగళవారం దౌల్తాబాద్‌ ఎంపీపీ కార్యాలయంలో కాంట్రాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 3 నెలల్లోగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. వివిధ గ్రామాల ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం టీడీపీ  పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఇల్లెందుల రమేష్‌  ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా సత్కరించారు.  ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గంగాధరి సంధ్య,  ఎంిపీడీవో మచ్చెందర్‌, తహసీల్దార్‌ అరుణ, పీఆర్‌ ఏఈ శరత్‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.  


‘తపస్‌’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) జిల్లా శాఖ  క్యాలెండర్‌ను ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జిల్లా విద్యాధికారి రవికాంతారావు మంగళవారం వేర్వేరుగా  ఆవిష్కరించారు.  ఆవిష్కరణలో జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బీరకాయల తిరుపతి,  రఘువర్ధన్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-12-30T05:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising