ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి

ABN, First Publish Date - 2020-07-08T11:45:38+05:30

సీజనల్‌ వ్యాధులు, కరోనా వైర్‌సపై ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వో మనోహర్‌ వైద్య సిబ్బందికి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎంఅండ్‌ హెచ్‌వో మనోహర్‌ 


హుస్నాబాద్‌, జూలై 7: సీజనల్‌ వ్యాధులు, కరోనా వైర్‌సపై ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వో మనోహర్‌ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం హుస్నాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో సీజనల్‌ వ్యాధులు, కరోనా వైర్‌సపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశాకార్యకర్తలతో నిర్వహిం చిన అవగాహన సమావేశంలో పలు సూచనలు చేశారు.  అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వర్షాకాలంలో మలేరియా, డెంగీ తదితర వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయని వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనాపై ప్రజలు భయాందోళన చెందొద్దని, గ్రామాల వారీగా టీంలను ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 47 మంది కరోనా బారిన పడ్డారని, ఇందులో 8 మంది చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు కోలుకున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సమావేశంలో వైద్యాధికారులు సౌమ్య, మురళీకృష్ణ, వైద్య సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2020-07-08T11:45:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising