పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలి
ABN, First Publish Date - 2020-02-28T10:54:51+05:30
ధర్నాలు, రాస్తారోకోలు వంటి శాంతి భద్రతల సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలతో పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మహేందర్రెడ్డి
సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 27: ధర్నాలు, రాస్తారోకోలు వంటి శాంతి భద్రతల సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలతో పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసులకు సూచించారు. పోలీసు అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ఆందోళనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ చందనాదీప్తి పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.
Updated Date - 2020-02-28T10:54:51+05:30 IST