కరోనాతో ఇద్దరు, అనుమానిత లక్షణాలతో మరొకరు మృతి.. 31 మందికి పాజిటివ్..
ABN, First Publish Date - 2020-07-03T20:45:53+05:30
సంగారెడ్డి జిల్లాలో గురువారం 31 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు. సంగారెడ్డి-8,
సంగారెడ్డి అర్బన్ (ఆంధ్రజ్యోతి) : సంగారెడ్డి జిల్లాలో గురువారం 31 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు. సంగారెడ్డి-8, సదాశివపేట-6, జహీరాబాద్-7, పటాన్చెరు-1, అశోక్నగర్-1, బీరంగూడ-5, అమీన్పూర్-2, పుల్కల్ మండలం సింగూర్లో ఒకరికి కరోనా సోకిందని డీఎంహెచ్వో పేర్కొన్నారు. కరోనాతో ఇద్దరు, అనుమానిత లక్షణాలతో మరొకరు మృతి చెందినట్లు తెలిపారు. కంది మండలం ఉత్తర్పల్లిలో ఒకరు, గుమ్మడిదలలో వృద్ధుడు కరోనాతో మృతిచెందగా, కరోనా అనుమానిత లక్షణాలతో సదాశివపేటలో మరొకరు మృతి చెందారని తెలిపారు.
వారందరినీ కోవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించామని పేర్కొన్నారు. సదాశివపేటలో మృతిచెందిన వ్యక్తి శాంపిళ్లు కోవిడ్ నిర్ధారణ కోసం సేకరించినప్పటికీ ఫలితం రావాల్సి ఉందన్నారు. జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్ నుంచి 21 మంది, జహీరాబాద్ నుంచి 46 శాంపిళ్లను గాంధీ ఆస్పత్రికి పంపామని చెప్పారు.
Updated Date - 2020-07-03T20:45:53+05:30 IST