మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు కాలినడక
ABN, First Publish Date - 2020-04-03T06:51:11+05:30
తమిళనాడుకు చెందిన కొందరు విద్యార్థులు మహరాష్ట్రలోని వార్థన్లో అగ్రికల్చర్ ఫుడ్స్లో శిక్షణ పొందుతున్నారు. 26 మంది కాలినడకన తమ స్వస్థలాలకు బయలుదేరారు.
గుండెపోటుతో ఒకరి కన్నుమూత
మారేడుపల్లి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): తమిళనాడుకు చెందిన కొందరు విద్యార్థులు మహరాష్ట్రలోని వార్థన్లో అగ్రికల్చర్ ఫుడ్స్లో శిక్షణ పొందుతున్నారు. 26 మంది కాలినడకన తమ స్వస్థలాలకు బయలుదేరారు. బుధవారం రాత్రి బోయిన్పల్లి రహదారిపై వెళుతుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారేడుపల్లిలోని ప్రత్యేక వసతి గృహానికి తరలించారు. అయితే, వారిలో లోగేష్(23) అనే యువకుడికి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడని మారేడుపల్లి ఇన్స్పెక్టర్ మట్టయ్య తెలిపారు.
Updated Date - 2020-04-03T06:51:11+05:30 IST