ఆన్లైన్ తరగతులు వినేలా చూడాలి
ABN, First Publish Date - 2020-10-20T05:38:35+05:30
ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అబ్జర్వర్ ఎమ్డీ.ఆజం కోరారు. సోమవారం ఊరుగొండ, దుర్గంపేట, సీతారాంపురం పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణ తీరును పరిశీలించారు
దామెర, అక్లోబరు 19: ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అబ్జర్వర్ ఎమ్డీ.ఆజం కోరారు. సోమవారం ఊరుగొండ, దుర్గంపేట, సీతారాంపురం పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థుల నుంచి సేకరించిన వర్క్ షీట్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, తిరుపతిరెడ్డి, ఇక్బాల్, కె.ఎల్లయ్య, శ్రీలత, సీఆర్పీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట: విద్యార్థులు ఆన్లైన్తరగతులు వినేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అబ్జర్వర్ మురళి కోరారు. పట్టణంలోని హన్మాన్దేవాలయ్ పాఠశాలను సోమవారం సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్లు, వర్క్షీట్లను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-20T05:38:35+05:30 IST